Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కర్ణాటకలో ప్రకంపనలు: రిక్టర్‌ స్కేల్‌పై 3.6గా తీవ్రత

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (22:20 IST)
ఉత్తర కర్ణాకటలోని పలు ప్రాంతాల్లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూమి కంపించిందని విజయపుర జిల్లా అధికారులు తెలిపారు. ఉదయం 10.29 గంటల సమయంలో విజయపురలోని ధనరంగిలో ప్రకంపనలు వచ్చాయని కర్ణాటక ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం పేర్కొంది. విజయపురలోని ధనరంగికి వాయువ్యంగా 2.9 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. 
 
అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు ఏడుసార్లు భూకంపాలు సంభవించడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇంతకు ముందు బీదర్‌, కలబురిగిలో ప్రకంపనలు వచ్చాయి. ఈ క్రమంలో వరుస భూకంపాలపై అధ్యయనం చేసేందుకు భూగర్భ శాస్త్రవేత్తల బృందాన్ని పంపారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments