Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీలో 182 మందికి కరోనా: ఫ్రెషర్స్ పార్టీనే కొంపముంచింది..

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (16:10 IST)
కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా పాఠశాలల్లో, కళాశాలల్లో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. వివరాల్లోకి వెళితే ధార్వాడలోని ఓ మెడికల్ కాలేజీలో 182 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 
 
ఓ విద్యార్థి చేసిన ఫ్రెషర్స్ పార్టీ కోవిడ్ వ్యాప్తికి కారణం అయ్యింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారందరికీ కూడా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ముందుగా 66 మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 182కు చేరింది. 
 
క్యాంపస్‌లో ఇటీవల నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీలో విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దీంతో ఈ పార్టీ కాస్త వైరస్ వ్యాప్తికి దారితీసిందని అధికారులు తెలిపారు. కరోనా సోకిన వారందర్నీ క్వారంటైన్ కు తరలించామన్నారు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు. హాస్టల్స్ కూడా మూసివేశామన్నారు. 
 
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిని సైతం ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. కొందరిలో తేలిక పాటి కరోనా లక్షణాలు ఉంటే.. మరికొందరిలో మాత్రం అసలు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. 
 
అందర్నీ క్యాంపస్ లోపలే ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. అటు ఒడిశా వైద్య కళాశాలలో కూడా 54 మందికి పాజిటివ్‌ రావడంతో నాలుగు హాస్టళ్లను మైక్రో కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. పది రోజులపాటు ప్రత్యక్ష తరగతులను సస్పెండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments