Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీలో 182 మందికి కరోనా: ఫ్రెషర్స్ పార్టీనే కొంపముంచింది..

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (16:10 IST)
కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా పాఠశాలల్లో, కళాశాలల్లో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. వివరాల్లోకి వెళితే ధార్వాడలోని ఓ మెడికల్ కాలేజీలో 182 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 
 
ఓ విద్యార్థి చేసిన ఫ్రెషర్స్ పార్టీ కోవిడ్ వ్యాప్తికి కారణం అయ్యింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారందరికీ కూడా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ముందుగా 66 మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 182కు చేరింది. 
 
క్యాంపస్‌లో ఇటీవల నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీలో విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దీంతో ఈ పార్టీ కాస్త వైరస్ వ్యాప్తికి దారితీసిందని అధికారులు తెలిపారు. కరోనా సోకిన వారందర్నీ క్వారంటైన్ కు తరలించామన్నారు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు. హాస్టల్స్ కూడా మూసివేశామన్నారు. 
 
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిని సైతం ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. కొందరిలో తేలిక పాటి కరోనా లక్షణాలు ఉంటే.. మరికొందరిలో మాత్రం అసలు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. 
 
అందర్నీ క్యాంపస్ లోపలే ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. అటు ఒడిశా వైద్య కళాశాలలో కూడా 54 మందికి పాజిటివ్‌ రావడంతో నాలుగు హాస్టళ్లను మైక్రో కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. పది రోజులపాటు ప్రత్యక్ష తరగతులను సస్పెండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments