Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురూ అమ్మాయిలే.. వారసుడు కావాలని భార్యనే చంపేశాడు..

తన భార్య మగపిల్లాడిని కనలేదనే కోపంతో భర్తే భార్య పట్ల కిరాతకంగా వ్యవహరించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోలార్ జిల్లా, మలరు తాలూకా దొడ్డకడతురు‌ చెందిన విజయ్ కుమార్ ర

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (18:40 IST)
తన భార్య మగపిల్లాడిని కనలేదనే కోపంతో భర్తే భార్య పట్ల కిరాతకంగా వ్యవహరించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోలార్ జిల్లా, మలరు తాలూకా దొడ్డకడతురు‌ చెందిన విజయ్ కుమార్ రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు.

విజయ్‌కు మంజుల అనే మహిళతో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. విజయ్ తనకు కుమారుడు కావాలని నిత్యం వేధించేవాడు.
 
తనకు వారసుడిగా కావాలన్నాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ గొడవ భార్యపై దాడికి దారితీసింది. విజయ్ తీవ్ర ఆగ్రహానికి గురై భార్య మంజులను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలకు గురైన మంజుల పెద్దగా అరవడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments