Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాపిల్లలతో బైకుపై వెళ్తుండగా దూకిన చిరుతపులి, చిరుతతో వీరోచిత పోరాటంలో...

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (16:38 IST)
సాధారణంగా క్రూరమృగాలను చూస్తే ఆమడదూరం పారిపోతుంటారు. కానీ, ఆ వ్యక్తి కోసం తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ఏకంగా చిరుతపులితో తలపడి విజయం సాధించారు. తన భార్య, కుమార్తెన కాపాడుకునేందుకు కుటుంబ యజమాని చిరుతపులిని చంపేశాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్ణాటకలోని హసన్ జిల్లా బెండాకెరె ప్రాంతానికి చెందిన రాజగోపాల్ నాయక్ అనే వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా, అటవీప్రాంతంలో ఓ చిరుతపులి దాడి చేసింది. 
 
చిరుత ధాటికి బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ క్రమంలో ఆ చిరుత తన భార్య, కుమార్తెలను గాయపర్చడం చూసిన రాజగోపాల్ నాయక్ ప్రాణాలకు తెగించి ఆ చిరుతతో పోరాడాడు. 
 
తనకు గాయాలు అయినప్పటికీ భయపడకుండా ఆ చిరుతపులిని చంపేశాడు. చిరుత దాడిలో గాయపడిన రాజగోపాల్‌తో పాటు అతడి భార్య, కుమార్తెలను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments