Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాపిల్లలతో బైకుపై వెళ్తుండగా దూకిన చిరుతపులి, చిరుతతో వీరోచిత పోరాటంలో...

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (16:38 IST)
సాధారణంగా క్రూరమృగాలను చూస్తే ఆమడదూరం పారిపోతుంటారు. కానీ, ఆ వ్యక్తి కోసం తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ఏకంగా చిరుతపులితో తలపడి విజయం సాధించారు. తన భార్య, కుమార్తెన కాపాడుకునేందుకు కుటుంబ యజమాని చిరుతపులిని చంపేశాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్ణాటకలోని హసన్ జిల్లా బెండాకెరె ప్రాంతానికి చెందిన రాజగోపాల్ నాయక్ అనే వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా, అటవీప్రాంతంలో ఓ చిరుతపులి దాడి చేసింది. 
 
చిరుత ధాటికి బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ క్రమంలో ఆ చిరుత తన భార్య, కుమార్తెలను గాయపర్చడం చూసిన రాజగోపాల్ నాయక్ ప్రాణాలకు తెగించి ఆ చిరుతతో పోరాడాడు. 
 
తనకు గాయాలు అయినప్పటికీ భయపడకుండా ఆ చిరుతపులిని చంపేశాడు. చిరుత దాడిలో గాయపడిన రాజగోపాల్‌తో పాటు అతడి భార్య, కుమార్తెలను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments