Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమాన భూతం... గొంతుపై కాలుతో తొక్కి భార్యను చంపేశాడు..

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (07:26 IST)
కట్టుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానం పెనుభూతమైంది. ఇదే విషయంపై భార్యతో పలుమార్లు భర్త గొడవ పెట్టుకున్నాడు. నేను అలాంటిదాన్ని కాదు అంటూ మొత్తుకున్నప్పటికీ.. భర్తకు పట్టిన అనుమాన భూతం మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో భార్య గొంతుపై కాలుతో తొక్కి చంపేశాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా హుణసూరు కల్కుణికె హోసింగ్‌ బోర్డు కాలనీలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ కాలనీకి చెందిన సౌమ్య(30), రవి అనే దంపతులు ఉన్నారు. వీరికి 11 యేళ్ళ క్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం పెరిగింది. దీంతో ఆమెతో అనేకసార్లు గొడవ పడ్డాడు. ఒకటిరెండుసార్లు పోలీసుల వద్దకు వెళ్లగా రాజీ చేసి పంపారు.
 
కానీ రవిలో అనుమాన భూతం పోలేదు. ఆదివారం నిద్రపోయిన సమయంలో భార్య గొంతుపైన రవి కాలుతో తొక్కి హత్య చేశాడు. ఆమె ఇంకా చనిపోలేదేమో అనే అనుమానంతో చున్నీని గొంతుకు బిగించి ఉరివేశాడు. తర్వాత ఇంటి నుంచి పరారైనాడు. 
 
సోమవారం ఉదయం ఎంతకు తలుపులు తీకపోవడంతో ఇరుగుపొరుగు వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుణసురు పొలీసులు పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. రంగనాథ లేఔట్‌లో దాక్కున్న కిరాతక భర్తను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments