Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార స్వామి పట్టాభిషేకానికి సోనియా - చంద్రబాబు - కేసీఆర్ కూడా...

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుమార స్వామి ఈనెల 24వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు, కుమార స్వామి మాత్రం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ మాజీ అధినేత్రి

Webdunia
మంగళవారం, 22 మే 2018 (11:38 IST)
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుమార స్వామి ఈనెల 24వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు, కుమార స్వామి మాత్రం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీలతో సమావేశమై, వారిభరోసాతో పాటు ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు.
 
ఆ తర్వాత కుమారస్వామి నేరుగా బీఎస్పీ ఆఫీస్‌కు వెళ్లారు. ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతిని కలిశారు. ఎన్నికల్లో మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం జరిగే తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఆహ్వానించారు. తర్వాత సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీతో ఫోన్‌లో మాట్లాడారు. ఏచూరీని కూడా ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెరాస అధినేత కేసీఆర్‌లను కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. వీరంతా కుమార స్వామి పట్టాభిషేకానికి హాజరుకానున్నారు. 
 
ఇదిలావుంటే, కర్ణాటక మంత్రివర్గం కూర్పు మంగళవారం సాయంత్రానికి ఖరారు చేయనున్నారు. మంత్రివర్గం కూర్పు, ఇతర అంశాలను ఖరారు బాధ్యతను కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కేసీ.వేణుగోపాల్‌కు కాంగ్రెస్ పెద్దలు అప్పగించారు. మరోవైపు, జేడీఎస్‌తో పొత్తు విషయంలో కొందరు కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలను కుమారస్వామి ఖండించారు. అవన్నీ బోగస్ వార్తలేనని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్‌ల మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలను మాజీ హోంమంత్రి రామలింగారెడ్డి కొట్టిపారేశారు. తాము వంద శాతం సంతోషంగా ఉన్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments