Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు గొలుసు మింగిన ఆవు - పొట్టకు ఆపరేషన్ చేసి తీశారు...

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (09:49 IST)
ఉత్తర కర్నాటక రాష్ట్రంలోని సిర్పి తాలూకా హీపనళ్ళిలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ గ్రామంలో ఒక రైతుకు చెందిన ఓ ఆవు బంగారు చైన్ మింగేసింది. దీన్ని వెలికి తీసేందుకు ఆవుకు ఆపరేషన్ చేశారు. ఈ సంఘటన దీపావళి సమయంలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఈ గ్రామానికి చెందిన శ్రీకాంత్ హెగ్డే అనే వ్యక్తి ఆ రైతు. తన కుటుంబ సభ్యులతో కలిసి గత దీపావళి పండుగను పురస్కరించుకుని గోపూజను నిర్వహించారు. ఇందుకోసం ఆవు, లేగదూడను అందంగా ముస్తాబు చేశారు. పూలదండలతో పాటు బంగారు గొలుసు కూడా వేశారు. అయితే, ఈ పూజ పూర్తయిన తర్వాత బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో ఆవు లేదా లేగదూడ మింగేసివుంటుందని భావించారు. 
 
అప్పటి నుంచి ప్రతి రోజూ ఉదయం పేడను పరిశీలిస్తూ వచ్చారు. ఎంతకీ గొలుసు కనిపించకపోవడంతో ఓ రోజున పశువైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆయన ఆవు పొట్టలో గొలుసు ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆవు పొట్టకు స్కానింగ్ చేసిన గొలుసు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. పిమ్మట కుటుంబ సభ్యుల వినతి మేరకు ఆవుకు ఆపరేషన్ నిర్వహించి, బంగారు గొలుసును వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments