Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు గొలుసు మింగిన ఆవు - పొట్టకు ఆపరేషన్ చేసి తీశారు...

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (09:49 IST)
ఉత్తర కర్నాటక రాష్ట్రంలోని సిర్పి తాలూకా హీపనళ్ళిలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ గ్రామంలో ఒక రైతుకు చెందిన ఓ ఆవు బంగారు చైన్ మింగేసింది. దీన్ని వెలికి తీసేందుకు ఆవుకు ఆపరేషన్ చేశారు. ఈ సంఘటన దీపావళి సమయంలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఈ గ్రామానికి చెందిన శ్రీకాంత్ హెగ్డే అనే వ్యక్తి ఆ రైతు. తన కుటుంబ సభ్యులతో కలిసి గత దీపావళి పండుగను పురస్కరించుకుని గోపూజను నిర్వహించారు. ఇందుకోసం ఆవు, లేగదూడను అందంగా ముస్తాబు చేశారు. పూలదండలతో పాటు బంగారు గొలుసు కూడా వేశారు. అయితే, ఈ పూజ పూర్తయిన తర్వాత బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో ఆవు లేదా లేగదూడ మింగేసివుంటుందని భావించారు. 
 
అప్పటి నుంచి ప్రతి రోజూ ఉదయం పేడను పరిశీలిస్తూ వచ్చారు. ఎంతకీ గొలుసు కనిపించకపోవడంతో ఓ రోజున పశువైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆయన ఆవు పొట్టలో గొలుసు ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆవు పొట్టకు స్కానింగ్ చేసిన గొలుసు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. పిమ్మట కుటుంబ సభ్యుల వినతి మేరకు ఆవుకు ఆపరేషన్ నిర్వహించి, బంగారు గొలుసును వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments