Webdunia - Bharat's app for daily news and videos

Install App

కె.రోశయ్యకు విశ్రాంతి.. తమిళనాడు గవర్నర్‌గా డీహెచ్.శంకరమూర్తి?

తమిళనాడు గవర్నర్‌గా ఉన్న కొణిజేటి రోశయ్యకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విశ్రాంతినివ్వనుంది. గవర్నర్ పదవి నుంచి ఆయనను తప్పించి.. ఆ స్థానంల కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక శాసన

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (11:45 IST)
తమిళనాడు గవర్నర్‌గా ఉన్న కొణిజేటి రోశయ్యకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విశ్రాంతినివ్వనుంది. గవర్నర్ పదవి నుంచి ఆయనను తప్పించి.. ఆ స్థానంల కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక శాసనమండలి ఛైర్మన్ డి.హెచ్.శంకరమూర్తిని నియమించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.
 
ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల అనంతరం బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో సంఖ్యా బలం ఎక్కువైంది. దీంతో శాసనమండలి ఛైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అందులోభాగంగానే జేడీఎస్‌తో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. అందులోభాగంగా జేడీఎస్ ఎమ్మెల్సీ బసవరాజ హొరట్టికి శాసమండలి ఛైర్మన్ పదవిని కట్టబెడతామని, తమకు డిప్యూటీ చైర్మన్ పదవి చాలని రాయబారాలు సాగిస్తున్నారు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వంతోపాటు ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా వివాద రహితుడిగా పేరున్న డి.హెచ్.శంకరమూర్తిని తమిళనాడు గవర్నర్‌గా పంపించాలని కమలనాథులు భావిస్తున్నట్టు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments