Webdunia - Bharat's app for daily news and videos

Install App

హువాహిన్ పట్టణంలో బాంబు పేలుళ్లు... పర్యాటకుల బెంబేలు

వరుస బాంబు పేలుళ్లతో థాయ్‌లాండ్ మరోమారు దద్దరిల్లిపోయింది. రాజధాని బ్యాంకాక్‌కు దగ్గరలో హువాహిన్‌ పట్టణంలోని క్లాక్‌టవర్‌ వద్ద శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా... దాదాపు

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (11:28 IST)
వరుస బాంబు పేలుళ్లతో థాయ్‌లాండ్ మరోమారు దద్దరిల్లిపోయింది. రాజధాని బ్యాంకాక్‌కు దగ్గరలో హువాహిన్‌ పట్టణంలోని క్లాక్‌టవర్‌ వద్ద శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా... దాదాపు 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 
 
కాగా 24 గంటల వ్యవధిలో 8 చోట్ల పేలుళ్లు సంభవించడంతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం పుకెట్‌లోనూ ముష్కరులు బాంబులతో దాడులు చేశారు. థాయ్‌లాండ్ రాణి సిరికిట్ పుట్టినరోజు సందర్భంగా అక్కడ సెలవు ప్రకటించారు. 
 
వరుస సెలవులు రావడంతో హువాహిన్ రిసార్ట్‌కు పర్యాటకులు పెద్దమొత్తంలో విచ్చేశారు. మృతుల్లో కొందరు థాయ్ పౌరులు, మరికొందరు విదేశీయులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్న వివరాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments