Webdunia - Bharat's app for daily news and videos

Install App

హువాహిన్ పట్టణంలో బాంబు పేలుళ్లు... పర్యాటకుల బెంబేలు

వరుస బాంబు పేలుళ్లతో థాయ్‌లాండ్ మరోమారు దద్దరిల్లిపోయింది. రాజధాని బ్యాంకాక్‌కు దగ్గరలో హువాహిన్‌ పట్టణంలోని క్లాక్‌టవర్‌ వద్ద శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా... దాదాపు

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (11:28 IST)
వరుస బాంబు పేలుళ్లతో థాయ్‌లాండ్ మరోమారు దద్దరిల్లిపోయింది. రాజధాని బ్యాంకాక్‌కు దగ్గరలో హువాహిన్‌ పట్టణంలోని క్లాక్‌టవర్‌ వద్ద శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా... దాదాపు 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 
 
కాగా 24 గంటల వ్యవధిలో 8 చోట్ల పేలుళ్లు సంభవించడంతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం పుకెట్‌లోనూ ముష్కరులు బాంబులతో దాడులు చేశారు. థాయ్‌లాండ్ రాణి సిరికిట్ పుట్టినరోజు సందర్భంగా అక్కడ సెలవు ప్రకటించారు. 
 
వరుస సెలవులు రావడంతో హువాహిన్ రిసార్ట్‌కు పర్యాటకులు పెద్దమొత్తంలో విచ్చేశారు. మృతుల్లో కొందరు థాయ్ పౌరులు, మరికొందరు విదేశీయులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్న వివరాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments