Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నేను అడిగినంత ఇవ్వకపోతే నువ్వు అన్నం ఎలా తింటావో చూస్తా'.. తెరాస ఎంపీకి నయీం వార్నింగ్

గ్యాంగ్‌స్టర్ నయీం ఆగడాలు అన్నీఇన్నీకావు. ఆయన హతమైన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నయీం జీవించివున్నప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలకే వార్నింగ్ ఇచ్చినట్టు ఇపుడు వెలుగులోకి వస

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (11:27 IST)
గ్యాంగ్‌స్టర్ నయీం ఆగడాలు అన్నీఇన్నీకావు. ఆయన హతమైన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నయీం జీవించివున్నప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలకే వార్నింగ్ ఇచ్చినట్టు ఇపుడు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వార్నింగ్‌లే ఆయన ప్రాణాల మీదికి వచ్చాయి. ఫలితంగా పక్కా స్కెచ్ వేసిన తెలంగాణ ప్రభుత్వం.. నాయీం కదలికలపై నిఘా పెట్టి.. ఎన్‌కౌంటర్ పేరుతో హతమార్చింది. తెరాస ఎంపీని, ఓ మంత్రిని నయీం బెదిరించాడు. ఇదే అంశంపై ఉత్తర తెలంగాణాకు చెందిన ఓ మంత్రి ఏకంగా సీఎం కేసీఆర్‌కే ఫిర్యాదు చేశారు.
 
'నయీమ్ ఆగడాలు అన్నీఇన్నీ కాదు. బయట తిరగలేకపోతున్నాం.. మమ్మల్ని సైతం బెదిరిస్తున్నాడు.. రూ.కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంటే వాడికి లెక్క లేదు..' అని సీఎం వద్ద ఆ మంత్రి వాపోయారు. అప్పట్నుంచే నయీమ్ ఆగడాలపై పోలీసు యంత్రాంగం ఓ కన్నేసి ఉంచింది. ఇక హైదరాబాద్ పరిసరాల్లోని అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీని రూ.25 కోట్లు ఇవ్వాల్సిందిగా నయీమ్ డిమాండ్ చేశాడు. 'ఇవ్వకపోతే నువ్వు అన్నం ఎలా తింటావో చూస్తా..' అని బెదిరించాడు.
 
రాష్ట్రంలో ఉన్నత స్థాయి రాజకీయ సంబంధాలున్న మరో పారిశ్రామికవేత్తను రూ.75 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ రెండు ఘటనలు కూడా అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టించాయి. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖ రాజకీయ నేతలనూ నయీమ్ లెక్కచేయలేదు. ఇలా గత రెండేళ్లలో పదుల సంఖ్యలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నయీమ్ బాధితుల జాబితాలో చేరిపోయారు. నయీమ్ ఆగడాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో సీఎం ఆదేశం మేరకు... టీఎస్ పోలీసులు పక్కా స్కెచ్‌తో నయీంను హతమార్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments