Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనర్హత వేటు ఎందుకు వేయాల్సి వచ్చిందంటే...

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (11:29 IST)
కర్నాటక రాజకీయాలు కొన్నిరోజులపాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెల్సిందే. ఆ సమయంలో కర్నాటక శాసనసభ స్పీకర్ కె. రమేష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆయన పతాక సన్నివేశంలో నిలిచారు. 
 
ముఖ్యంగా, 17 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై ఉక్కుపాదం మోపారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశాలను సైతం పక్కన పెట్టి సంచలనం రేపారు. బీజేపీ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్దమైన తరుణంలో రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు కూడా వేశారు.
 
ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అంత్యక్రియల కోసం ఆయన సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారశైలి చట్ట వ్యతిరేకంగా ఉందనే విషయం తనకు అర్థమైందని... ఆ ధైర్యంతోనే వారిపై అనర్హత వేటు వేశానని చెప్పారు. 
 
తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనన్నారు. అదేసమయంలో తాను చేసింది గొప్ప పనేం కాదని... కాకపోతే, యువతరానికి మార్గదర్శకంగా నిలవాలన్నారు. ఇతర రాష్ట్రాల స్పీకర్లు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోరో తనకు అర్థం కాదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments