పొంచివున్న ఒమిక్రాన్ ముప్పు : రాత్రిపూట కర్ఫ్యూ విధించిన కర్నాటక

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (15:24 IST)
ఒమిక్రాన్ వైరస్ ముప్పు పొంచివుండటంతో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయనుంది. ఒకవైపు ఒమిక్రాన్ వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది. మరోవైపు, కొత్త సంవత్సర వేడుకలు సమీపించాయి. దీంతో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో స్థానికల పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 
 
దీంతో కర్నాటక ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను విధించింది. ఈ నెల 28వ తేదీ నుంచి పది రోజుల పాటు కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సుధాకర్ వెల్లడించారు. ఈ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతోందని, ఆ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. కాగా, కర్నాటక ప్రభుత్వం ఇప్పటికే కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments