Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి చొరబడిన చిరుత.. బాలుడుని నోట కరుచుకుని పట్టుకెళ్లింది...

Webdunia
ఆదివారం, 10 మే 2020 (09:59 IST)
కరోనా వైరస్ పుణ్యమాని అనేక పశుపక్ష్యాదులతో పాటు... క్రూరమృగాలు, వన్యప్రాణాలకు పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టు అయింది. దేశ వ్యాప్తంగా వాహన రాకపోకలు పూర్తిగా బంద్ కావడంతో అనేక ప్రాంతాల్లో వన్య ప్రాణులు, చిరుతలు, పులులు, ఏనుగులు, జింకలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. అయితే, పలు ప్రాంతాల్లో కొన్ని క్రూరమృగాలు ఇళ్లలోకి చొరబడుతున్నాయి. దీంతో పలు విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 
 
తాజాగా కర్నాటక రాష్ట్రంలోని రామనగర జిల్లాలో ఓ విషాదకర సంఘటన జరిగింది అటవీ ప్రాంతం నుంచి జనసంచారంలోకి వచ్చిన ఓ చిరుత నేరుగా ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న మూడేళ్ల బాలుడుని నోట కరుచుకుని పట్టుకెళ్లి తినేసింది. 
 
జిల్లాలోని మాగడి తాలూకా కదరయ్యనపాళ్యానికి చెందిన కుటుంబం వేసవి కావడంతో ఇంటి తలుపులు తెరిచి నిద్రపోయింది. వీరు మంచి నిద్రలో ఉండగా అర్థరాత్రి వేళ ఇంట్లోకి చొరబడిన చిరుత వారి మూడేళ్ల కుమారుడు హేమంత్‌ను నోట కరుచుకుని పట్టుకెళ్లింది.
 
ఉదయం లేచి చూసే సరికి కుమారుడు కనిపించకపోవడంతో దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు మంగళగౌరమ్మ, చంద్రప్ప దంపతులు గ్రామస్థులతో కలిసి సమీపంలో గాలించారు. ఇంటికి 60 మీటర్ల దూరంలోని ముళ్ల పొదల్లో బాలుడి మృతదేహం కనిపించినట్టు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత ఆనవాళ్లను సేకరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments