Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు కోర్టులో ఉద్యోగం వచ్చిందనీ పెట్రోల్ పోసి...

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (13:14 IST)
ప్రస్తుతకాలంలో భార్యాభర్తలు కలిసి సంపాదిస్తేనే కుటుంబ పోషణ గగనంగా మారింది. అందుకే అనేక మంది మహిళలు తమ భర్తలకు చేదోడువాదోడుగా ఉండేందుకు తమకు తెలిసిన పనులకు వెళుతుంటారు. అయితే, ఆ మహిళకు ఏకంగా కోర్టులోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని భర్త.. భార్యను హత్య చేసేందుకు యత్నించాడు. భార్యను కుర్చీలో కట్టేసి, పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే, అదృష్టవశాత్తు ఆమె ఇరుగుపొరుగువారి సాయంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. 
 
స్థానిక సురేశ్ రాజన్‌ అనే వ్యక్తికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈయన భార్య ఇఫ్షీబాయికి కోర్టులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అయితే.. భార్య ఉద్యోగం చేయటం ఇష్టం లేని అతడు ఆమెపో కోపంతో రగిలిపోయాడు. ఆమెను వేధించడం ప్రారంభించిన అతడు ఇటీవల ఓ రోజు ఆమెను కూర్చీకి కట్టేశాడు. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. 
 
దీంతో ప్రాణ భయంతో వణికిపోయిన ఆమె..పెద్ద పెట్టున కేకలు పెట్టండంతో ఇరుగు పొరుగు వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వారు బాధితురాలిని కాపాడి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భార్య ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

ప్రేమించడం లేదా అన్నది తన వ్యక్తిగతం : సమంత

Samantha: ఇంకోసారి ప్రేమలో పడి ఆలోచనే సమంతకు లేదా? జెస్సీ రోల్ అంటే చాలా ఇష్టం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments