Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యకు కోర్టులో ఉద్యోగం.. కోపంతో ఊగిపోయిన భర్త.. ఏం చేశాడంటే?

భార్యకు కోర్టులో ఉద్యోగం.. కోపంతో ఊగిపోయిన భర్త.. ఏం చేశాడంటే?
, శనివారం, 19 సెప్టెంబరు 2020 (17:12 IST)
భార్యకు కోర్టులో ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె భర్త మాత్రం కోపంతో రగిలిపోయాడు. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి తగల పెట్టేందుకు ప్రయత్నించాడు. ఆయితే ఆమె అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు అప్రమత్తమవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పిపోయింది. నిందితుడు సురేశ్ రాజన్‌కు 15 ఏళ్ల క్రితం వివాహం అయింది. కాగా.. ఆగస్టు 2 అతడి భార్య ఇఫ్షీబాయికి కోర్టులో ఉద్యోగం వచ్చింది.
 
అయితే.. భార్య ఉద్యోగం చేయటం ఇష్టం లేని అతడు ఆమె కోపంతో రగిలిపోయాడు. ఆమెను వేధించడం ప్రారంభించిన అతడు ఇటీవల ఓ రోజు ఆమెను కూర్చీకి కట్టేశాడు. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. 
 
దీంతో ప్రాణ భయంతో వణికిపోయిన ఆమె.. పెద్ద పెట్టున కేకలు పెట్టండంతో ఇరుగు పొరుగు వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వారు బాధితురాలిని కాపాడి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్‌ క్లాస్‌లు.. బాలికకు వేధింపులు.. నాలుగు లక్షలు గోవిందా..