Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడు మగాడ్రా బుజ్జీ...కమల్, రజినీలపై గుర్రుగా ఉన్న అభిమానులు..

జయలలిత మరణం తరువాత తమిళనాడులో కొత్త రక్తం వస్తోంది. అందులోను సినీ ప్రముఖులే రాజకీయాల్లోకి వస్తారని అందరూ భావించారు. మొదటి నుంచి సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించే చర్చ జరిగింది. కొంతమంది రాజకీయ విశ్లేషకులతో కూడా సమావేశమైన రజినీ చివరకు

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (13:45 IST)
జయలలిత మరణం తరువాత తమిళనాడులో కొత్త రక్తం వస్తోంది. అందులోను సినీ ప్రముఖులే రాజకీయాల్లోకి వస్తారని అందరూ భావించారు. మొదటి నుంచి సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించే చర్చ జరిగింది. కొంతమంది రాజకీయ విశ్లేషకులతో కూడా సమావేశమైన రజినీ చివరకు వెనక్కి తగ్గి రాజకీయాల్లోకి వెళ్ళడం పూర్తిగా మానేసినట్టున్నారు. రజినీ విషయం పక్కనబెడితే మరో నటుడు కమల్ హాసన్ కూడా అదే ఊపును మొదట్లో ప్రదర్శించాడు.
 
తమిళనాడులో నెలకొన్న సమస్యలపై తాను రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వస్తేనే మంచిదన్న నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇక అందరూ కమల్ హాసన్ ఒకటిరెండు రోజుల్లో పార్టీ పెట్టేస్తారని అనుకున్నారు. కానీ కమల్ కూడా రజినీ బాటలోనే నడిచాడు. ఊరించి ఉసూరుమనిపించాడు. అయితే కన్నడ నటుడు ఉపేంద్ర మాత్రం తాను అనుకున్న విధంగానే పార్టీ పెట్టేశాడు. అనుకున్న సమయానికి, అనుకున్న విధంగానే పార్టీ గుర్తును గీసి ఏకంగా రాజకీయ పార్టీకే పురుడు పోశాడు. ఇప్పుడంతా కన్నడ, పక్కనే ఉన్న తమిళ రాజకీయాలంతా ఉపేంద్ర చుట్టూ తిరుగుతోంది.
 
ఉపేంద్ర పార్టీ పెట్టిన తరువాత అటు కమల్ ఇటు రజినీ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. పార్టీ పెడతామని ఇప్పటివరకు పెట్టని తమ అభిమాన హీరోలపై గుర్రుగా ఉన్నారు. ఉపేంద్రను ఆదర్శంగా తీసుకోనైనా కమల్, రజినీలు  పార్టీ పెట్టాలని కోరుతున్నారు. అయితే అభిమానుల మొరను ఈ హీరోలు ఎంతవరకు పాటిస్తారో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments