Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ - షాలనే కాదు.. సీబీఐ - ఈడీలను కూడా మట్టికరిపించిన మమత బెనర్జీ?

Webdunia
బుధవారం, 5 మే 2021 (19:36 IST)
ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని అందుకున్న వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని అనేక మంది రాజకీయ నేతలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా, బీజేపీ నేతలు మినహా దేశంలోని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నేత ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. 
 
మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌మ‌ల్‌నాథ్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో వ‌రుస‌గా మూడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకున్న‌ మ‌మ‌తాబెన‌ర్జి దేశ నాయ‌కురాలు అని అభివ‌ర్ణించారు. 
 
అయితే, గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌ధ్య చాలా తేడా ఉన్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఎన్నిక‌ల్లో మ‌మ‌తాబెన‌ర్జి త‌న ప్ర‌త్య‌ర్థులైన ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీని, హోం మంత్రి అమిత్ షా, బీజేపీని, సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను మ‌ట్టిక‌రిపించార‌ని చెప్పారు.
 
వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌మ‌తాబెన‌ర్జి ప్ర‌ధాని ప‌ద‌వి కోసం న‌రేంద్ర‌ మోడీని ఢీకొట్టే అవ‌కాశాలు ఉన్నాయా అన్న ప్ర‌శ్న‌కు క‌మ‌ల్‌నాథ్ స్పందిస్తూ.. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మ వ్యూహం ఏమిట‌నే విష‌యాన్ని యూపీఏ కూట‌మి స‌రైన స‌మ‌యంలో వెల్ల‌డిస్తుంద‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments