Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ - షాలనే కాదు.. సీబీఐ - ఈడీలను కూడా మట్టికరిపించిన మమత బెనర్జీ?

Webdunia
బుధవారం, 5 మే 2021 (19:36 IST)
ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని అందుకున్న వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని అనేక మంది రాజకీయ నేతలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా, బీజేపీ నేతలు మినహా దేశంలోని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నేత ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. 
 
మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌మ‌ల్‌నాథ్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో వ‌రుస‌గా మూడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకున్న‌ మ‌మ‌తాబెన‌ర్జి దేశ నాయ‌కురాలు అని అభివ‌ర్ణించారు. 
 
అయితే, గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌ధ్య చాలా తేడా ఉన్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఎన్నిక‌ల్లో మ‌మ‌తాబెన‌ర్జి త‌న ప్ర‌త్య‌ర్థులైన ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీని, హోం మంత్రి అమిత్ షా, బీజేపీని, సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను మ‌ట్టిక‌రిపించార‌ని చెప్పారు.
 
వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌మ‌తాబెన‌ర్జి ప్ర‌ధాని ప‌ద‌వి కోసం న‌రేంద్ర‌ మోడీని ఢీకొట్టే అవ‌కాశాలు ఉన్నాయా అన్న ప్ర‌శ్న‌కు క‌మ‌ల్‌నాథ్ స్పందిస్తూ.. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మ వ్యూహం ఏమిట‌నే విష‌యాన్ని యూపీఏ కూట‌మి స‌రైన స‌మ‌యంలో వెల్ల‌డిస్తుంద‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments