మోడీ ప్యాంట్లు వేసుకోకముందు నుంచే ఇండియన్ ఆర్మీ వుంది : కమల్ నాథ్

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (12:06 IST)
భారత ఆర్మీ విషయంలో కాంగ్రెస్ పార్టీని ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే విమర్శించడంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మిస్టర్ మోడీ.. మీరు ప్యాంట్లు, పైజామాలు వేసుకోకముందు నుంచే ఇండియన్ ఆర్మీ ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సలహా ఇచ్చారు. 
 
అంతేకాకుండా, మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ హయాంలోనే భారత సైన్యం, వాయుసేన, నౌకాదళం పటిష్టంగా రూపుదిద్దుకున్నాయని గుర్తుచేశారు. పైగా, తనను భ్రష్ట్ నాథ్(అవినీతికి అధిపతి)అని మోడీ పిలవడంపై కూడా కమల్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
దేశంలో ఇప్పటివరకూ నరేంద్ర మోడీ హయాంలోనే అత్యధిక ఉగ్రదాడులు జరిగాయన్నారు. 2001లో ఎవరి హయాంలో పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా భారత్ తమ హయాంలోనే సురక్షితంగా ఉందంటూ మోడీ డబ్బా కొట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments