Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ హాసన్‌కు పిచ్చిపట్టింది.. మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలి : బీజేపీ

దేశంలో హిందూ ఉగ్రవాదులు పెరిగిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన సినీ హీరో కమల్ హాసన్‌పై భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. కమల్ హాసన్‌కు పిచ్చిపట్టిందంటూ మండిపడుతున్నారు. కమల్ మానసిక ఆరోగ్యం బాగోలేద

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (16:36 IST)
దేశంలో హిందూ ఉగ్రవాదులు పెరిగిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన సినీ హీరో కమల్ హాసన్‌పై భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. కమల్ హాసన్‌కు పిచ్చిపట్టిందంటూ మండిపడుతున్నారు. కమల్ మానసిక ఆరోగ్యం బాగోలేదని... వెంటనే ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించాలని బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్ అన్నారు. 
 
కమల్ హాసన్ వ్యాఖ్యలపై ఆయన ఢిల్లీలో స్పందిస్తూ, హిందూ ఉగ్రవాదం అనే పదం వాడినందుకు కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే కమల్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కమల్‌పై పరువునష్టం దావా అంశాన్ని కూడా తమిళనాడు బీజేపీ శాఖ పరిశీలిస్తోందన్నారు. 
 
అంతకుముందు కమల్ హాసన్ ఓ తమిళ పత్రికకు రాసిన వ్యాసంలో దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందని కమల్ ఆరోపించారు. ఈ ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గుజరాత్, యూపీ, రాజస్థాన్‌లలో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. 
 
హిందూ సంస్థలు గతంలో హింసకు పాల్పడేవికాదని, మాటలతోనే ప్రత్యర్థులను ఎదుర్కొనేవని, ఇప్పుడు మాత్రం భౌతిక దాడులకు కూడా తెగబడుతున్నాయని కమల్ తన కథనంలో పేర్కొన్నారు. హిందూ ఉగ్రవాదులను కొందరు వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వేడి పుట్టిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments