Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు రెండో పెళ్లి చేసి పెట్టిన భార్య.. మగ సంతానం కోసం బాలికను కిడ్నాప్ చేసి?

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (11:04 IST)
భర్తకు రెండో పెళ్లి చేసేందుకు భార్య తెగించింది. తనకు ముగ్గురు అమ్మాయిలు పుట్టడంతో వారసుడు కావాలని ఆమె తపించింది. ఎలాగైనా వారసుడు కావాలన్న ఉద్దేశంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి ఓ బాలికను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను ఓ గుడికి తీసుకెళ్లి తన భర్తతో వివాహం జరిపించింది. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. కడలూరు, దిట్టకుడి ఉల్లవయ్యంగుడికి చెందిన అశోక్‌కుమార్-చెల్లకిళి దంపతులు ముగ్గురు అమ్మాయిలు వున్నారు. ఈ దంపతులు మగపిల్లాడి కోసం స్థానికంగా నివసించే ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నారు. ఈ నెల 7న అమ్మాయి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి బాలికను తమతోపాటు ఆలయానికి తీసుకెళ్లారు.
 
అందరూ కలిసి గుడికి చేరుకున్న తర్వాత చెల్లకిళి తమ ప్లాన్‌ను అమలు చేసింది. తన భర్తతో ఆ అమ్మాయికి పెళ్లి చేసింది. అయితే, గుడికి వెళ్లిన తమ కుమార్తె మూడు రోజులైనా రాకపోవడంతో అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు చెల్లకిళిని నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె చెప్పిన సమాధానం విని విస్తుపోయిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె భర్త అశోక్ కుమార్ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments