ఆర్థిక మందగమనం : కేంద్ర మంత్రివర్గంలోని కేవీ కామత్?

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (10:08 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. దీనిప్రభావం భారత్‌లో కూడొ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతింది. అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను గణనీయంగా తగ్గించివేశారు. అలాగే, నగదు చెలామణీ, లావాదేవీలు కూడా బాగా తగ్గిపోయాయి. వీటన్నింటిన ప్రభావం కారణంగా దేశ వృద్ధిరేటు కూడా ఊహించినదానికంటే తగ్గిపోయింది. 2019-20 సంవత్సరంలో దేశ వృద్ధిరేటు ఐదు శాతం కంటే తక్కువగా నమోదు కావొచ్చని అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు వీలుగా బ్రిక్స్ దేశాలకు చెందిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఛైర్మన్‌గా ఉన్న కేవీ కామత్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలోనే తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఈ విస్తరణలో కేవీ కామత్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ కేవీ కామత్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్న పక్షంలో ఆయన్ను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఈయనతో పాటు.. బీజేపీ ఎంపీ స్వప్నదాస్ గుప్తాకు కూడా మంత్రి పదవి లభించనుందనీ, ఆయనకు మానవ వనరుల శాఖ సహాయ మంత్రి పదవి రావచ్చని తెలుస్తోంది. మాజీ మంత్రి సురేశ్ ప్రభుకు కూడా మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశాలున్నాయి.
 
కామత్ అనుభవం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన బ్రిక్స్ కూటమి దేశాల బ్యాంక్ ఛైర్మన్‌గా పనిచేస్తూ విజయపథంలో ముందుకు సాగుతున్నారు. గతంలో ఆయన ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు ఛైర్మన్‌గా పనిచేశారు. ఐసీఐసీఐ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, ఎండీ, సీఈవోగా కూడా పనిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments