Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసదుద్దీన్‌ ఓవైసీకి ఎదురుదెబ్బ.. జమీరుల్‌ హసన్‌ పార్టీకి బైబై

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (11:17 IST)
పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు మార్చి 27వ తేదీ నుంచి ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. చివరి దశ ఎన్నికలో ఏప్రిల్‌ 29న జరుగనుండగా.. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతోంది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ -వామపక్షాలు, బీజేపీ మధ్య ఈసారి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఏఐఎంఐఎం పార్టీకి బలముంది. 
 
కానీ ఎన్నికలకు ముందే ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ బెంగాల్‌ చీఫ్‌ జమీరుల్‌ హసన్‌ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఆయన ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జమీరుల్‌ మీడియాతో మాట్లాడుతూ బెంగాల్‌ 95శాతం మంది కార్యకర్తలు తనతోనే ఉన్నారన్నారు. బీజేపీ కోసం పని చేసేందుకే అసద్‌ బెంగాల్‌కు వచ్చారని, అందుకే అబ్బాస్‌ సిద్దిఖీతో సమావేశమయ్యారని ఆరోపించారు.
 
నందిగ్రామ్‌లో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా బలమైన పోటీదారులందరికీ మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. నందిగ్రామ్‌లో మమతా బెనర్జీకి మద్దతు ఇస్తున్నామని, తద్వారా సువేందు అధికారి గెలవలేరన్నారు. 

సంబంధిత వార్తలు

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments