Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో చెడు తిరుగుళ్లు వద్దన్న తమ్ముడు.. చంపేసిన అక్క.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (09:58 IST)
తన అక్కకు ఓ తమ్ముడు హితవచనాలు పలికాడు. ప్రియుడితో కలిసి చెడు తిరగొద్దని చెప్పాడు. ఈ మాటలు ఆమెకు ఏమాత్రం రుచించలేదు. తనకే శుద్ధులు చెబుతావా అంటూ సొంత తమ్ముడిని అక్క చంపేసింది. ఈ హంతకురాలు ప్రభుత్వ ఉద్యోగి కావడం గమనార్హం. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఈ జిల్లాకు చెందిన చంచల్ కుమారి అనే 25 యేళ్ల యువతి ఓ థర్మల్ పవర్ స్టేషన్‌లో ఉద్యోగం చేస్తుంది. ఆ పవర్ స్టేషన్‌కు సంబంధించి క్వార్టర్స్‌లోనే ఉంటుంది. ఆమె సోను అన్సారీ అనే వ్యక్తిని ప్రేమిస్తూ వచ్చింది. ఈ విషయం ఆ యువతి సోదరుడు రోహిత్ కుమార్‌కి తెలిసి, అతను మన కులంకాదని, అతన్ని ప్రేమిస్తూ, అతనితో చెడు తిరుగుళ్లు తిరగొద్దని 21 యేళ్ల తమ్ముడు కోరాడు. ఇది ఆ యువతికి ఏమాత్రం రుచించలేదు. దీన్ని మనస్సులో పెట్టుకున్న ఆ యువతి తన ప్రియుడితో కలిసి సొంత తమ్ముడినే కడతేర్చింది. 
 
తన కుమారుడు కనిపించడం లేదంటూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ యువతి నివశించే గృహ సముదాయ ప్రాంగణంలోనే రోహిత్ మృతదేహం లభించింది. శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు లోతుగా ఆరా తీశారు. తన ప్రియుడు కలిసి హత్య చేసినట్టుగా చంచల కుమారి అంగీకరించినట్టు అంగీకరించింది. దీంతో చంచల్ కుమారితో పాటు ఆమె ప్రియుడు అన్సారీని పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments