జేఈఈ మెయిన్ షెడ్యూల్ రిలీజ్ - పరీక్షలు ఎప్పటి నుంచంటే...

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (08:31 IST)
జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పరీక్ష కోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) ఈ షెడ్యూల్ వెల్లడించింది. గురువారం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఐఐటీల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మెయిన్ సెషన్-1 పరీక్షలను జనవరి 24-31వ తేదీల మధ్య నిర్వహిస్తారు. 26వ తేదీన రిపబ్లిక్ డే కావడంతో ఆ రోజున మాత్రం ఈ ప్రవేశ పరీక్ష ఉండదు.
 
ఈ పరీక్షకు గురువారం నుంచే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ పరీక్షల కోసం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ సహా మొత్తం 13 భారతీయ ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు సిద్ధం చేస్తున్నారు. 
 
కాగా, జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉందని ఎన్.టి.ఏతెలిపింది. సెషన్-2 కోసం ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు. 202-2022 సంవత్సరాలుల్ 12వ తరగతి లేదంటే అందుకు సమానమైన గుర్తింపు కలిగిన విద్యార్హత ఉన్నవారు ఈ పరీక్షలను రాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments