Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. అమ్మను ఊపిరాడని స్థితిలోనే తీసుకొచ్చారు.. ప్రతాప్ రెడ్డి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. జయలలితను అపోలోకు ఊపిరాడని స్థితిలోనే తీసుకొచ్చారని అపోలో ఆసుపత్రుల వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి తెలిపారు. జయలలిత మరణంపై అనుమానా

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (08:26 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. జయలలితను అపోలోకు ఊపిరాడని స్థితిలోనే తీసుకొచ్చారని అపోలో ఆసుపత్రుల వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి తెలిపారు.

జయలలిత మరణంపై అనుమానాలున్నాయని ప్రజలు, విపక్షాలు చెప్తున్న నేపథ్యంలో.. ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రీతారెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబరు 12 రాత్రి జయ ఊపిరాడని స్థితిలోనే చేరారని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు చివరికి ఫలితం మాత్రం అందరూ ఊహించినట్టుగా కాకుండా వేరేలా వచ్చిందన్నారు. 
 
కాగా జయలలిత మరణంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడుతున్న తరుణంలో.. ఇన్నాళ్లు జయలలిత చికిత్స పట్ల ఏవేవో చెప్పుకొచ్చిన అపోలో యాజమాన్యం ప్రస్తుతం నిజాలను వెల్లడించింది. ఇందులో భాగంగా అపోలో గ్రూప్ సంస్థల ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి నోరు విప్పారు. జయలలితను చాలా క్రిటికల్ పొజిషన్‌లో హాస్పిటల్‌కు తీసుకొచ్చారని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపారు. ఆమెను బతికించేందుకు డాక్టర్లు చాలా ప్రయత్నించారన్నారు. కానీ వ్యాధి తీవ్రత ఎక్కువగా వుండటంతో పరిస్థితి విషమించిందని చెప్పారు. 
 
ప్రజల భావోద్వేగాలను గుర్తుపెట్టుకుని ఆమె ఆరోగ్యం పట్ల నిజాలను బయటికి చెప్పవద్దని ఆదేశాలు రావడంతో వాస్తవాలను బయటికి చెప్పలేకపోయామని తెలిపారు. హై షుగర్ కారణంగానే జయలలిత మరణించారు. 500 పాయింట్స్ షుగర్ పెరగడంతో ప్రాణాలు కోల్పోయారని వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments