జయలలితకు మోతాదుకుమించి స్టెరాయిడ్స్.. అందుకే...

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసు ఓ మిస్టరీగా మారింది. ఈ కేసులో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (08:41 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసు ఓ మిస్టరీగా మారింది. ఈ కేసులో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా, జయలలితకు చేసిన ప్రాథమిక చికిత్సలో మోతాదుకుమించి స్టెరాయిడ్స్ వాడినట్టు ప్రభుత్వ ఆక్యుపంక్చర్ వైద్యుడు శంకర్ వెల్లడించాడు. ఈ మేరకు జయ మృతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిషన్ ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. 
 
జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ అరుముగస్వామి కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. ఈ కమిషన్ ఎదుట జయలలితకు ఆక్యుపంక్చర్ వైద్యం చేసిన శంకర్ హాజరై సాక్ష్యం ఇచ్చారు. "జయలలిత అస్వస్థతకుగురైన వెంటనే ఆమె నివాసంలోనే ప్రాథమిక చికిత్స చేశారు. అప్పుడు ఆమె త్వరగా కోలుకునేందుకు వీలుగా మోతాదుకు మించి స్టెరాయిడ్లు ఇచ్చినట్టు గుర్తించాం" అని తెలిపారు.  
 
కాగా, జయలలిత మృతి కేసులో ఆమెకు అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ అధికారులను కమిషన్ విచారించనుంది. అలాగే ఈనెల 20న జయ సన్నిహితురాలు, మాజీ సీఎస్ షీలా బాలకృష్ణన్, 21న మరో మాజీ సీఎస్ రామ్మోహనరావులు విచారణ సంఘం ఎదుట హాజరుకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments