Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు మోతాదుకుమించి స్టెరాయిడ్స్.. అందుకే...

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసు ఓ మిస్టరీగా మారింది. ఈ కేసులో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (08:41 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసు ఓ మిస్టరీగా మారింది. ఈ కేసులో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా, జయలలితకు చేసిన ప్రాథమిక చికిత్సలో మోతాదుకుమించి స్టెరాయిడ్స్ వాడినట్టు ప్రభుత్వ ఆక్యుపంక్చర్ వైద్యుడు శంకర్ వెల్లడించాడు. ఈ మేరకు జయ మృతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిషన్ ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. 
 
జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ అరుముగస్వామి కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. ఈ కమిషన్ ఎదుట జయలలితకు ఆక్యుపంక్చర్ వైద్యం చేసిన శంకర్ హాజరై సాక్ష్యం ఇచ్చారు. "జయలలిత అస్వస్థతకుగురైన వెంటనే ఆమె నివాసంలోనే ప్రాథమిక చికిత్స చేశారు. అప్పుడు ఆమె త్వరగా కోలుకునేందుకు వీలుగా మోతాదుకు మించి స్టెరాయిడ్లు ఇచ్చినట్టు గుర్తించాం" అని తెలిపారు.  
 
కాగా, జయలలిత మృతి కేసులో ఆమెకు అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ అధికారులను కమిషన్ విచారించనుంది. అలాగే ఈనెల 20న జయ సన్నిహితురాలు, మాజీ సీఎస్ షీలా బాలకృష్ణన్, 21న మరో మాజీ సీఎస్ రామ్మోహనరావులు విచారణ సంఘం ఎదుట హాజరుకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments