Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయమ్మ మృతి కేసు : చిన్నమ్మ శశికళకు సమన్లు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి కేసు విచారణ వేగవంతమైంది. ఇందులోభాగంగా, జయలలిత ప్రియనెచ్చెలి శశికళతో పాటు.. జయలలితకు చికిత్స చేసిన అపోలో ఆస్పత్రికి కోర్టు సమన్లు జారీచేసింది. నిర్ణీత గడువులోగా

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2017 (14:54 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి కేసు విచారణ వేగవంతమైంది. ఇందులోభాగంగా, జయలలిత ప్రియనెచ్చెలి శశికళతో పాటు.. జయలలితకు చికిత్స చేసిన అపోలో ఆస్పత్రికి కోర్టు సమన్లు జారీచేసింది. నిర్ణీత గడువులోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో శశికళకు 15 రోజులు, అపోలో ఆసుపత్రికి 10 రోజుల గడువు విధించింది. 
 
జయలలిత అక్రమాస్తుల కేసులో రెండో ముద్దాయిగా ఉన్న శశికళ ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పణ అగ్రహారజైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే. అలాగే, జయ మృతిపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి జస్టీస్ ఆరుముగ స్వామి నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కమిటీ విచారణ జరుపుతోంది. 
 
ఈ నేపథ్యంలో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు... జయలలితకు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి కోర్టు సమన్లు జారీచేయడం గమనార్హం. మరోవైపు, ఆసుపత్రిలో ఫ్రూట్ జ్యూస్ తాగుతున్న జయలలిత వీడియోను దినకరన్ వర్గీయులు విడుదల చేసిన సంగతి కూడా తెలిసిందే. దీంతో జయలలిత మృతి కేసు సరికొత్త మలుపు తిరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments