Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమృతకు బెదిరింపులు.. చెన్నై నుంచి బెంగళూరుకు..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను తానేనంటూ చెప్తూ.. సుప్రీం కోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేసిన అమృతకు ప్రాణముప్పు వుందని తమిళనాట ప్రచారం సాగుతోంది. జయలలిత కుమార్తెను తానేనని.. కావాలంటే డీఎ

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (12:40 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను తానేనంటూ చెప్తూ.. సుప్రీం కోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేసిన అమృతకు ప్రాణముప్పు వుందని తమిళనాట ప్రచారం సాగుతోంది. జయలలిత కుమార్తెను తానేనని.. కావాలంటే డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది అమృత. అయితే సుప్రీం కోర్టు కర్ణాటక హైకోర్టులో ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాల్సిందిగా ఆదేశించింది. అమృత పిటిషన్‌ను తోసిపుచ్చింది. 
 
ఈ నేపథ్యంలో అమృతకు బెదిరింపులు వస్తున్నాయని.. దీంతో అమృత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. చెన్నైలో న్యాయవాదులతో చర్చించిన తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయిన అమృత.. ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియట్లేదట. 
 
అయితే అమృత త్వరలోనే కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారని సమాచారం. జయలలిత కుమార్తెను తానేనని నిరూపించుకునేందుకు సిద్ధంగా వున్నానని.. అమ్మకు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయాలని.. ఆమె మరణంపై అనుమానాలున్నాయని.. సమగ్ర విచారణకు సైతం డిమాండ్ చేస్తూ అమృత కోర్టు మెట్లెక్కే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments