Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకానికి జయలలిత చరాస్తులు - కిలోల కొద్ది బంగారం

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (12:59 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఇంట్లో స్వాధీనం చేసుకున్న చరాస్తులు ఒకనాడు సంచలనాత్మకంగా మారాయి. 2003లో జయలలిత ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను విక్రయించేందుకు రంగ సిద్ధమైంది. అక్రమార్జన కేసులో స్వాధీనం చేసుకున్న జయలలిత చరాస్తుల్ని విక్రయించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా అడ్వకేట్ ‌కిరణ్ ఎస్. జావలిని కర్నాటక ప్రభుత్వం నియమించింది. ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువులు ఆ రోజు సంచలనాత్మకంగా మారాయి. 
 
భారీ స్థాయిలో నగలు, వజ్రాభరణాలు, వందలాది వెండి వస్తువులు, చెప్పులు సైతం పెద్ద మొత్తంలో అధికారులు ఆరోజులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఏడు కిలోల బంగారం, వజ్రాభరణాలు, 600 కిలోల వెండి వస్తువులు, 11 వేల చీరలు, 750 జతలు చెప్పులు, 91 చేతి గడియారాలు, 131 సూట్ కేసులు, 1040 వీడియో క్యాసెట్లు, ఏసీలు, ఫ్రిడ్జిలు తదితర గృహోపకరణాలు ఉన్నాయి.
 
జయలలితపై 2003లో నమోదైన అక్రమార్జను కేసుని గతంలో కర్నాటక కోర్టుకు బదిలీ చేశారు. కేసు బదిలీ కావడంతో జయలలిత ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను సైతం కర్నాటకు తరలించారు. ఇదే కేసులో గతంలో జయలలిత శిక్ష కూడా అనుభించారు. ప్రస్తుతం జయలలిత ఆస్తులను అమ్మకానికి పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments