Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. తెల్లవారుజామున ఇంటికొచ్చాడు.. ముగ్గురిని?

జవాను అయినప్పటికీ భార్యపై కలిగిన అనుమానంతో ముగ్గురుని పొట్టనబెట్టుకున్నాడు. భార్య పక్కింటి అబ్బాయితో అక్రమ సంబంధం కలిగివుందని అనుమానించిన జవాను.. క్షణికావేశంలో ముగ్గురిని కాల్చి చంపేశాడు. వివరాల్లోకి

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (13:23 IST)
జవాను అయినప్పటికీ భార్యపై కలిగిన అనుమానంతో ముగ్గురుని పొట్టనబెట్టుకున్నాడు. భార్య పక్కింటి అబ్బాయితో అక్రమ సంబంధం కలిగివుందని అనుమానించిన జవాను.. క్షణికావేశంలో ముగ్గురిని కాల్చి చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీప వాసి సురేందర్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) జవాను అతని భార్యతో కలిసి కాశ్మీర్‌లో నివాసం ఉంటున్నారు. 
 
వారికి ఇద్దరు పిల్లలు. జమ్మూలోని దులాస్టిలోని నేనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేసే సురేందర్.. గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. అయితే అదే సమయానికి పక్కింటి వ్యక్తి  రాజేష్ బయట వుండటాన్ని చూశాడు. 
 
అంతే రాజేష్‌ను కాల్చి చంపాడు. ఆపై భార్యను కూడా కాల్చేశాడు. శబ్ధం విని బయటికి వచ్చిన రాజేష్ సతీమణిని కూడా హతమార్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. సీఐఎస్ఎఫ్ అధికారులు, సురేందర్‌ను సస్పెండ్ చేశారు. ఇక రెండు జంటలకు చెందిన పిల్లల బాధ్యతలను తాము చూసుకుంటామని సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments