Webdunia - Bharat's app for daily news and videos

Install App

బారాముల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో నంద్యాల జవాను వీరమరణం

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (08:59 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మరోమారు ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఇక్కడ ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ యువ జవాను వీరమరణం చెందారు. ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య కాల్పులు జరగ్గా, ఈ కాల్పుల్లో నంద్యాల జిల్లాకు చెందిన యువ జవాను వీరమరణం చెందాడు. 
 
జిల్లాలోని పాములపాడు మండలం మద్దూరు పంచాయతీకి చెందిన సురేంద్ర(24) 2019లో సైన్యంలో చేరారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు మంగళవారం సమాచారం అందింది. 
 
మూడు రోజుల క్రితమే తమతో ఫోనులో మాట్లాడిన కుమారుడు శాశ్వతంగా దూరమయ్యాడని తెలిసి తల్లిదండ్రులు సుబ్బమ్మ, సుబ్బయ్య తల్లడిల్లిపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కావడంలేదు.
 
సెప్టెంబరు నెలలో ఇంటికి వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సురేంద్ర పార్థివదేహం బుధవారం ఉదయానికి స్వగ్రామం చేరే అవకాశం ఉంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments