Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ ధృవపత్రాల తయారీలో వలంటీర్ల.. అరెస్టు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (08:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అమల్లోకి తెచ్చిన వాలంటరీ వ్యవస్థలోని పలువురు వాలంటీర్లు అడ్డుదారులు తొక్కుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల బంగారం, డబ్బు కోసం ఒ వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేశాడు. ఇపుడు మరో వాలంటీర్ ప్రభుత్వ పథకాలను పొందేందుకు నకిలీ ధృవపత్రాలు తయారు చేసి జైలుపాలయ్యాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా అచ్యుతాపురంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీకి చెందిన సచివాలయంలో పని చేస్తున్న డిజిటల్ సహాయకుడు సుధీర్ అనే వ్యక్తి ఓ అవివాహితుడు. డిజిటల్ కీ ఉపయోగించి వివాహమైనట్టు ఓ నకిలీ వివాహ పత్రానికి సృష్టించుకున్నాడు. అలాగే, సచివాలయంలోని మహిళా పోలీసులు బురుగుబెల్లి రాజేశ్వరి, పైలా వెంకటలక్ష్మి భర్తలతో కలిసి ఉంటున్నా విడాకులు తీసుకున్నట్టు నకిలీ పత్రాలు తయారు చేశాడు.
 
ఈ విషయాన్ని గుర్తించిన పంచాయితీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... సచివాలయ ఉద్యోగులతో పాటు వారికి సహకరించిన వాలంటీర్ నానాజీపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వీరిపై నామమాత్రపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో వారు జైలు నుంచి బయటకు వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments