Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ ప్రధానితో జపాన్ ప్రధాని భేటీ.. కీలక అంశాలపై చర్చ

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (11:40 IST)
PM Kishida
భారత్‌లో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో జపాన్ భారత పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా సమావేశం అవుతారు. 
 
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దీంతోపాటు ఉక్రెయిన్‌లో పరిస్థితిపై ఇరువురు కీలక నేతలు చర్చిస్తారు. ఈ భేటీలో భాగంగా... ఇండో-పసిఫిక్‌లో రక్షణ, పరస్పర సహకారంపై చర్చించనున్నారు. 
 
ఇరు దేశాలద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడంతోపాటు పలు కీలక విషయాలపై నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం కీలకం కానుంది. ఈ భేటీ సందర్భంగా భారత్‌లో జపాన్ పెట్టుబడుల అంశంపై కూడా చర్చించనున్నారు.
 
కాగా.. ఇరువురు నేతల మధ్య ఇదే తొలి భేటీ కావడం విశేషం. అంతకుముందు భారత్ – జపాన్ శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 2018లో టోక్యోలో జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments