Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ ప్రధానితో జపాన్ ప్రధాని భేటీ.. కీలక అంశాలపై చర్చ

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (11:40 IST)
PM Kishida
భారత్‌లో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో జపాన్ భారత పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా సమావేశం అవుతారు. 
 
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దీంతోపాటు ఉక్రెయిన్‌లో పరిస్థితిపై ఇరువురు కీలక నేతలు చర్చిస్తారు. ఈ భేటీలో భాగంగా... ఇండో-పసిఫిక్‌లో రక్షణ, పరస్పర సహకారంపై చర్చించనున్నారు. 
 
ఇరు దేశాలద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడంతోపాటు పలు కీలక విషయాలపై నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం కీలకం కానుంది. ఈ భేటీ సందర్భంగా భారత్‌లో జపాన్ పెట్టుబడుల అంశంపై కూడా చర్చించనున్నారు.
 
కాగా.. ఇరువురు నేతల మధ్య ఇదే తొలి భేటీ కావడం విశేషం. అంతకుముందు భారత్ – జపాన్ శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 2018లో టోక్యోలో జరిగింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments