Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నుకు బుల్లెట్ తగిలినా బిడ్డకు జన్మనిచ్చిన జవాను భార్య

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సంజువాన్‌లోని ఆర్మీ శిబిరంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడి జరిపాయి. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు కూడా వీరమరణం చెందారు. అయితే, ఇదే కాల్పుల్లో గాయపడిన ఓ జవాను భార్య మాత్రం ఓ

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (13:01 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సంజువాన్‌లోని ఆర్మీ శిబిరంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడి జరిపాయి. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు కూడా వీరమరణం చెందారు. అయితే, ఇదే కాల్పుల్లో గాయపడిన ఓ జవాను భార్య మాత్రం ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గర్భిణి వెన్నెముకకు బుల్లెట్ గాయం తగిలినప్పటికీ ఆమె ప్రసవించిన బిడ్డకు మాత్రం చిన్న గాయం కూడా కాలేదు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముష్కర మూకల కాల్పుల్లో రైఫిల్‌ మ్యాన్ నజీర్‌ అహ్మద్‌తో పాటు ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. నిండు గర్భిణి అయిన ఆమెను వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌లో జమ్మూలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేశారు. 
 
ఆ తర్వాత అంటే ఆదివారం రాత్రి సిజేరియన్ తర్వాత ఆడశిశువుకు జన్మిచ్చింది. తల్లీకూతుళ్లు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆర్మీ డాక్టర్లు తెలిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బాధితురాలి వెన్నెముకకు బుల్లెట్ తగిలింది. అయితే ఆమె కడుపులో ఉన్న పాపకు చిన్న గాయం కూడా కాకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments