Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న ఆఫీసులు... నేడు నివాసాలు : సోనూసూద్‌పై ఐటీ గురి

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (15:18 IST)
కరోనా కష్టకాలంలో ఎంతో మందికి ఆపద్బాంధవుడుగా ఉన్న బాలీవుడ్ నటుడు సోనూసూద్‌పై ఐటీ శాఖ గురిపెట్టింది. బుధవారం ముంబైలోని ఆరు ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. రెండోరోజైన గురువారం ఆయన నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. 
 
లక్నోకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో సోనూ చేసుకున్న ఒప్పందాలపై అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. డీల్‌కు‌ సంబంధించి పన్ను ఎగవేశారన్న ఆరోపణలు వచ్చాయని, దానిపైనే దర్యాప్తు సాగుతోందని ఓ అధికారి చెప్పారు. ఈ తనిఖీలు కేవలం ‘సర్వే’ మాత్రమేనని చెప్పుకొచ్చారు.
 
బుధవారం ముంబైలోని జుహులో ఉన్న సోనూ స్వచ్ఛంద సంస్థతో పాటు ఆరు ప్రాంతాల్లో ఉన్న ఆఫీసులు, ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. 20 గంటల పాటు పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే, ప్రతిపక్షాలు ఈ దాడులపై మండిపడుతున్నాయి. 
 
కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్న సోనూకు గుర్తింపు రావడం వల్లే ప్రభుత్వం కక్షగట్టిందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం సోనూను అంబాసిడర్‌గా నియమించుకుంది. అందుకే బీజేపీ ప్రభుత్వం కక్షగట్టి ఈ సోదాలు చేయిస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments