Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్మోహన్‌రావు నివాసంలో డైరీ లభ్యం.. 20కి పైగా కీలక దస్త్రాలను పరిశీలించారు..

తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు నివాసంలో ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు భావిస్తున్న దైనందిని(డైరీ) ప్రస్తుతం పాలకపక్షం అన్నాడీఎంకేకు చెందిన కీలక నేతలు, ఐఏఎస్‌, ఐపీఎ

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (09:45 IST)
తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు నివాసంలో ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు భావిస్తున్న దైనందిని(డైరీ) ప్రస్తుతం పాలకపక్షం అన్నాడీఎంకేకు చెందిన కీలక నేతలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. రామ్మోహనరావు నివాసంలో ఆదాయపన్ను అధికారులు దాడులు నిర్వహించి కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ డైరీ కూడా ఉందని సమాచారం.  
 
దైనందినలో ఆదాయ పన్ను అధికారులకు పాలకపక్షానికి చెందిన నేతలు, మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పేర్లు కనిపించినట్లు చెప్తున్నారు. అన్నాడీఎంకే సీనియర్‌ నేతలకు సాయం చేసిన కీలక పనుల గురించి ఆయన వివరంగా రాసుకున్నట్లు.. ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పేరు, ఐపీఎస్‌ అధికారుల్లో ఐజీ, ఏడీజీపీ స్థాయిలోని కొందరు అధికారుల పేర్లున్నాయని తెలిసింది. 
 
వీరంతా వృత్తి రీత్యా రామమోహనరావుతో కలిసి పనిచేశారని తెలియడంతో వారి టెలిఫోన్‌ సంభాషణలను అధ్యయనం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దైనందినలోని పేర్ల ఆధారంగా ఆ అధికారులపై ఆదాయ పన్ను దాడులకు సన్నాహాలు జరుగుతున్నాయంటున్నారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత అపోలో ఆస్పత్రిలో రెండున్నర నెలలు ఉన్నప్పుడు ప్రధాన కార్యదర్శి హోదాలో రామ్‌మోహనరావు సంతకాలు చేసిన 20కి పైగా కీలక దస్త్రాలను కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments