పీఎస్‌ఎల్‌వీ -సీ51 కౌంట్‌డౌన్ ప్రారంభం..

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:54 IST)
సరికొత్త అధ్యాయానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కౌంట్‌డౌన్‌ ప్రారంభించింది. ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో తొలి అంతరిక్ష ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదివారం చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ -సీ51 ప్రయోగంతో వాణిజ్యరంగంలో తొలి అడుగు వేయనుంది. 
 
ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో (షార్‌)లో రాకెట్‌ కౌంట్‌డౌన్‌ను శాస్త్రవేత్తలు ఉదయం 8.54 గంటలకు ప్రారంభించారు. సుమారు 25.30 గంటల పాటు ప్రక్రియ కొనసాగనుంది. ఆదివారం ఉదయం 10.24గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.
 
అమెజానియా-1తో పాటు మరో 18 ప్రైవేటు ఉపగ్రహాలను రాకెట్‌ మోసుకెళ్లనుంది. న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ నేతృత్వంలో నింగిలోకి తొలి వాణిజ్య ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌ కక్షలో ప్రవేశపెట్టనుంది. 
 
బ్రెజీలియన్‌ శాటిలైట్‌ అమెజానియా-1 భూపర్యవేక్షణకు కీలకమైంది. అమెరికాకు చెందిన స్పేస్‌ బీస్‌ పేరుతో 12 ఉపగ్రహాలు, సాయ్‌-1 నానో కాంటాక్ట్‌-2 అనే ఒక ఉపగ్రహంతో పాటు యూనిటీశాట్‌ పేరుతో మూడు యూనివర్సిటీల విద్యార్థులు తయారుచేసిన మూడు ఉపగ్రహాలు, సతీశ్‌ ధావన్‌ శాట్, సింధునేత్ర అనే ఉపగ్రహాలను రోదసీలోకి పంపనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments