Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో అలా వెళ్ళిన యువకుడు ఇలా వచ్చేశాడు..?

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (18:07 IST)
కాశ్మీర్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు యువకులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. చాలామంది విద్యావంతులను ఉగ్రవాదంలోకి లాగేస్తున్నాయి. దీంతో చాలామంది యువకులు ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. అలా మారిపోయిన యువకులు ఇంటి వైపు తిరిగి చూడట్లేదు. తల్లిదండ్రులను, బంధువులను వదిలిపెట్టి.. వెళ్లిపోతున్నారు. 
 
కానీ జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మాత్రం విభిన్నమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీనగర్, ఖనియార్‌కు చెందిన ఎహతేషాం బిలాల్ సోఫీ (20) నిషేధిత ఉగ్రవాద సంస్థలో చేరాడు. నోయిడాలో ఇంజనీరింగ్ చదువుకున్న కుమారుడు కనపించకపోయేసరికి.. అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. చివరికి బిలాల్ ఉగ్రవాదిగా మారిపోయాడని తెలుసుకుని అతని తల్లిదండ్రులు షాకయ్యారు. 
 
అంతేగాకుండా.. తమ వంశంలో బిలాల్ ఒక్కడే కుమారుడని.. అతడిని విడిచిపెట్టాలని అతని తల్లిదండ్రులు ఉగ్రవాద సంస్థకు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రుల విజ్ఞప్తికి తోడు పోలీసులు కూడా బిలాల్‌ గురించి గాలింపు చర్యలు చేపట్టడంతో బిలాల్ ఆదివారం రాత్రి ఇల్లు చేరాడు. బిలాల్ రాకతో.. అతని తల్లిదండ్రుల సంతోషానికి అవధుల్లేవు. అతని వద్ద విచారణ జరిపామని.. అతనిని అరెస్ట్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments