Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

ఠాగూర్
మంగళవారం, 21 మే 2024 (09:26 IST)
ఈ నెల 19వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నగరంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా దేశంలో ఆత్మాహుతి దాడులతో మారణహోమం సృష్టించేందుకు ప్రవేశించినట్టు వారివద్ద జరిపిన విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా, యాదులు, హిందూ దేవాలయాలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుని ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడాలన్న కృతనిశ్చయంతో వచ్చారు. ఈ నిందితులంతా శ్రీలంక జాతీయులుగా పోలీసులు గుర్తించారు. పైగా, పాకిస్థాన్‌లో కరుడుగట్టిన ఉగ్రవాది అబూతో టచ్‌లో ఉన్నట్టు తేలింది. 
 
గుజరాత్  పోలీసు శాఖకు చెందిన ఉగ్రవాద నిరోధక బృందం నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. నిందితులను ముహమ్మద్ నుస్రత్, ముహమ్మద్ ఫారిస్, ముహమ్మద్ రస్దీన్, ముహమ్మద్ నఫ్రాన్‌లుగా గుర్తించారు. శ్రీలంక జాతీయులైన వీరంతా కొలంబో నుంచి చెన్నైకు వచ్చి అక్కడ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు వీరు వచ్చినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 
 
భారత్‌లోని యాదులు, హిందూ దేవాలయాలతో పాటు కొందరు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రముఖులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు చేయాలనేది వీరి ప్లాన్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. పట్టుబడిన ఉగ్రవాదుల్లో ఒకరికి పాక్ వీసా కూడా ఉండటం గమనార్హం. భారత్‌‍లో కొందరితో ఉగ్రవాదులు సంప్రదింపులు జరిపివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments