Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వలేం : చిదంబరానికి సుప్రీం షాక్

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (11:27 IST)
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ త‌న‌ను అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున‌ద‌ని, త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబ‌రం పిటిష‌న్ పెట్టుకున్నారు. 
 
కేసు ద‌ర్యాప్తు ఆరంభ‌ద‌శ‌లో ఉన్న‌ప్పుడు బెయిల్ ఇవ్వ‌డం వ‌ల్ల ఆ కేసు విచార‌ణ మంద‌గిస్తుంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వ‌లేమ‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఆర్థిక నేరాలు భిన్న‌మైన‌వ‌ని, వాటిని ద‌ర్యాప్తు చేసేందుకు ప‌ద్ధతులు కూడా భిన్నంగా ఉంటాయ‌ని కోర్టు స్పష్టం చేసింది. 
 
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబ‌రం మ‌నీల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసులో ఇప్ప‌టికే చిదంబ‌రం సీబీఐ క‌స్ట‌డీలో ఉన్నారు. ఆగ‌స్టు 21న రాత్రి హై డ్రామా మ‌ధ్య చిదంబ‌రాన్ని సీబీఐ పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. కాగా, ఇప్పటికే చిదంబరం వద్ద ఈడీ అధికారులు విచారణ జరిపిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments