Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మా అత్తను త్వరగా చంపు తల్లీ" అంటూ కరెన్సీ నోటుపై రాసి హుండీలో వేశారు... (Video)

ఠాగూర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (17:46 IST)
మా అత్తను త్వరగా చంపు తల్లీ అంటూ రూ.20 వేల నోటుపై రాసి హుండీలో వేశారో గుర్తు తెలియని ఓ మహిళ. కర్నాటక రాష్ట్రంలోని కలబుర్గి పట్టణంలో ఉన్న భాగ్యమతి అమ్మవారి ఆలయంలోని హుండీలో ఓ కరెన్సీ నోటుపై రాసి ఉన్న అక్షరాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. "అమ్మా.. మా అత్తను త్వరగా చంపు తల్లీ" అంటూ ఓ రూ.20 నోటుపై రాసి హుండీలో వేశారు. ఆ అక్షరాలు కన్నడ భాషలో ఉన్నాయి. పరకామణిలో హుండీ సొమ్మున లెక్కిస్తుండగా ఈ నోటు కనబడింది. అయితే, అత్తను చంపమని రాసింది కోడలో, మరి అల్లుడో తెలియదు కానీ, ఆ నోటు మాత్రం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 
 
జన్మనిచ్చిన ఆ మహనీయుడుని స్మరించుకుంటూ... 
 
మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్రావు వర్థింతిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు వర్థంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ నివాసంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ పూజలో తల్లి అంజనా దేవి, సోదరుడు నాగబాబు దంపతులు, చిరంజీవి దంపతులు పాల్గొన్నారు. వీరందరితో కలిసి చిరంజీవి తన తండ్రి చిత్రపటానికి పూల మాల వేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం తాలూకు ఫోటోలు,  వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. "జన్మనిచ్చిన ఆ మహనీయుడిని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
 
మరోవైపు, చిరంజీవి కొత్త చిత్రాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన బింబిసారా దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో సినిమా చేయనున్నారు. ఇటీవలే అధికారికంగా ఈ ప్రాజెక్టుపై ప్రకటన కూడా వచ్చింది. నేచురలో స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సీనియర్ దర్శకులతో కాకుండా యువ దర్శకులతో చిరంజీవి కొత్త కొత్త చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments