ఉపాధ్యాయుల శిక్షణ కోసం బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలి: ఇన్ఫీ నారాయణ మూర్తి

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (11:15 IST)
పాఠశాల ఉపాధ్యాయులకు స్టెమ్ రంగాల్లో దేశ విదేశాల్లో రిటైర్డ్ టీచర్లతో శిక్షణ ఇప్పించాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ఈ దిశగా దేశ వ్యాప్తంగా ట్రెయిన్ ది టీచర్ సెంటర్లను నెలకొల్పాలని ఆయన సలహా ఇచ్చారు. జాతీయ విద్యా విధానం లక్ష్యాల కోసం ఈ చర్యలు కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఇందుకోసం స్టెమ్ రంగాల్లో భారత్ అభివృద్ధి దిశగా టీచర్ల శిక్షణ కోసం ప్రభుత్వం భారీ ఖర్చు చేయాలని ఆయన కోరారు. భారత్ సహా వివిధ దేశాల్లో పదివేల మంది రిటైర్డ్ టీచర్‌తో ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయులకు స్టెమ్ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు యేటా బిలియన్ డాలర్ల ఖర్చు చేయాలని సూచించారు. టీచర్లు, పరిశోధకులను గౌరవించుకోవాలని, వారికి మంచి జీతాలు వసతులు కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యంతోనే తాము 2009లో ఇన్ఫోసిస్ ప్రైజ్ ఏర్పాటు చేశామన్నారు. 
 
జాతీయ విద్యా విధానం లక్ష్యాలను సాధించేందుకు టీచర్ల శిక్షణ ఎంతో కీలకమని నారాయణ మూర్తి అన్నారు. స్టెమ్ రంగాల్లో పాఠశాల టీచర్లకు రిటైర్డ్ టీచర్లతో శిక్షణకు దేశ వ్యాప్తంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. యేడాది పాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగాలని ఆయన బుధవారం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కార్యక్రమంలో సూచించారు. ఇలా సుశిక్షితులైన టీచర్లు మరింత మంది టీచర్లకు మార్గదర్శకంగా మారతారని ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments