Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయుల శిక్షణ కోసం బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలి: ఇన్ఫీ నారాయణ మూర్తి

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (11:15 IST)
పాఠశాల ఉపాధ్యాయులకు స్టెమ్ రంగాల్లో దేశ విదేశాల్లో రిటైర్డ్ టీచర్లతో శిక్షణ ఇప్పించాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ఈ దిశగా దేశ వ్యాప్తంగా ట్రెయిన్ ది టీచర్ సెంటర్లను నెలకొల్పాలని ఆయన సలహా ఇచ్చారు. జాతీయ విద్యా విధానం లక్ష్యాల కోసం ఈ చర్యలు కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఇందుకోసం స్టెమ్ రంగాల్లో భారత్ అభివృద్ధి దిశగా టీచర్ల శిక్షణ కోసం ప్రభుత్వం భారీ ఖర్చు చేయాలని ఆయన కోరారు. భారత్ సహా వివిధ దేశాల్లో పదివేల మంది రిటైర్డ్ టీచర్‌తో ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయులకు స్టెమ్ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు యేటా బిలియన్ డాలర్ల ఖర్చు చేయాలని సూచించారు. టీచర్లు, పరిశోధకులను గౌరవించుకోవాలని, వారికి మంచి జీతాలు వసతులు కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యంతోనే తాము 2009లో ఇన్ఫోసిస్ ప్రైజ్ ఏర్పాటు చేశామన్నారు. 
 
జాతీయ విద్యా విధానం లక్ష్యాలను సాధించేందుకు టీచర్ల శిక్షణ ఎంతో కీలకమని నారాయణ మూర్తి అన్నారు. స్టెమ్ రంగాల్లో పాఠశాల టీచర్లకు రిటైర్డ్ టీచర్లతో శిక్షణకు దేశ వ్యాప్తంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. యేడాది పాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగాలని ఆయన బుధవారం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కార్యక్రమంలో సూచించారు. ఇలా సుశిక్షితులైన టీచర్లు మరింత మంది టీచర్లకు మార్గదర్శకంగా మారతారని ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments