ఉపాధ్యాయుల శిక్షణ కోసం బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలి: ఇన్ఫీ నారాయణ మూర్తి

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (11:15 IST)
పాఠశాల ఉపాధ్యాయులకు స్టెమ్ రంగాల్లో దేశ విదేశాల్లో రిటైర్డ్ టీచర్లతో శిక్షణ ఇప్పించాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ఈ దిశగా దేశ వ్యాప్తంగా ట్రెయిన్ ది టీచర్ సెంటర్లను నెలకొల్పాలని ఆయన సలహా ఇచ్చారు. జాతీయ విద్యా విధానం లక్ష్యాల కోసం ఈ చర్యలు కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఇందుకోసం స్టెమ్ రంగాల్లో భారత్ అభివృద్ధి దిశగా టీచర్ల శిక్షణ కోసం ప్రభుత్వం భారీ ఖర్చు చేయాలని ఆయన కోరారు. భారత్ సహా వివిధ దేశాల్లో పదివేల మంది రిటైర్డ్ టీచర్‌తో ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయులకు స్టెమ్ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు యేటా బిలియన్ డాలర్ల ఖర్చు చేయాలని సూచించారు. టీచర్లు, పరిశోధకులను గౌరవించుకోవాలని, వారికి మంచి జీతాలు వసతులు కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యంతోనే తాము 2009లో ఇన్ఫోసిస్ ప్రైజ్ ఏర్పాటు చేశామన్నారు. 
 
జాతీయ విద్యా విధానం లక్ష్యాలను సాధించేందుకు టీచర్ల శిక్షణ ఎంతో కీలకమని నారాయణ మూర్తి అన్నారు. స్టెమ్ రంగాల్లో పాఠశాల టీచర్లకు రిటైర్డ్ టీచర్లతో శిక్షణకు దేశ వ్యాప్తంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. యేడాది పాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగాలని ఆయన బుధవారం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కార్యక్రమంలో సూచించారు. ఇలా సుశిక్షితులైన టీచర్లు మరింత మంది టీచర్లకు మార్గదర్శకంగా మారతారని ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments