దేశంలో బెస్ట్ స్మార్ట్ సిటీగా ఇండోర్ నగరం..

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (15:22 IST)
దేశంలో బెస్ట్ స్మార్ట్ సిటీగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం నిలిచింది. ఆయా నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు అక్కడ ఉన్న సౌకర్యాలు ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో ఇండోర్ నగరం తొలి స్థానంలో నిలిచింది. 
 
కేంద్ర ప్రభుత్వం గత 2022 సంవత్సరానికిగాను ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డులను శుక్రవారం ప్రకటించింది. ఇందులో మధ్యప్రదేశ్ బెస్ట్ స్టేట్ అవార్డును గెలుచుకోగా, తమిళనాడు రాష్ట్రానికి రెండో అవార్డు దక్కింది. అలాగే, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. 
 
ఇకపోతే, అత్యుత్తమ నగరాల్లో రెండో స్థానంలో సూరత్ నగరం నిలవగా, మూడో స్థానంలో ఆగ్రా నిలించింది. వివిధ ప్రాజెక్టుల ఫలితాలు, ప్రాజెక్టుల ప్రగతి, బహుమతుల కోసం ప్రజంటేషన్ ఇచ్చిన తీరు వంటి ఆధారంగా నగరాలు, రాష్ట్రాల్లో ఉత్తమమైనవాటిని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్విత్వశాఖ ఎంపిక చేసింది. ఈ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల27వ తేదీన ఇండోర్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments