Webdunia - Bharat's app for daily news and videos

Install App

ల్యాండ్ అవుతుండగా భూమికి తగిలిన విమానం తోకభాగం.. తప్పిన పెనుముప్పు

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (14:49 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం ల్యాండ్ అవుతుండగా దాని తోకభాగం నేలకు తగిలింది. అయితే, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైలెట్ల అప్రమత్తతో అది సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనతో విమానం దెబ్బతినడంతో దాని సర్వీసులను నిలిపివేశారు. 
 
ఈ ఘటన రెండు రోజుల క్రితం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్‌ 11న కోల్‌కతా నుంచి వచ్చిన ఇండిగో వీటీ-ఐఎంజీ విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా.. తోక భాగం రన్‌వే నేలను తాకింది. అయితే, విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై డీజీసీఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
 
"విమానం ల్యాండ్‌ అయ్యేంతవరకు ఏ సమస్యా తలెత్తలేదు. రన్‌వేను సమీపిస్తుండగా.. సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా విమానం కదులుతున్నట్లు పైలట్లు గుర్తించారు. అలాగే ల్యాండింగ్‌ ప్రక్రియను ఆరంభించారు. అయితే విమానం దిగే సమయంలో దాని తోకభాగం రన్‌వే నేలను తాకింది" అని డీజీసీఏ వెల్లడించింది.
 
ఈ ఘటన కారణంగా విమానం వెనుకభాగం దెబ్బతింది. దీంతో దాని సేవలను నిలిపివేసినట్లు ఇండిగో వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. అప్పటిదాకా విమానం నడిపిన పైలట్లను కూడా విధుల నుంచి పక్కనబెట్టినట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments