Webdunia - Bharat's app for daily news and videos

Install App

ల్యాండ్ అవుతుండగా భూమికి తగిలిన విమానం తోకభాగం.. తప్పిన పెనుముప్పు

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (14:49 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం ల్యాండ్ అవుతుండగా దాని తోకభాగం నేలకు తగిలింది. అయితే, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైలెట్ల అప్రమత్తతో అది సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనతో విమానం దెబ్బతినడంతో దాని సర్వీసులను నిలిపివేశారు. 
 
ఈ ఘటన రెండు రోజుల క్రితం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్‌ 11న కోల్‌కతా నుంచి వచ్చిన ఇండిగో వీటీ-ఐఎంజీ విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా.. తోక భాగం రన్‌వే నేలను తాకింది. అయితే, విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై డీజీసీఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
 
"విమానం ల్యాండ్‌ అయ్యేంతవరకు ఏ సమస్యా తలెత్తలేదు. రన్‌వేను సమీపిస్తుండగా.. సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా విమానం కదులుతున్నట్లు పైలట్లు గుర్తించారు. అలాగే ల్యాండింగ్‌ ప్రక్రియను ఆరంభించారు. అయితే విమానం దిగే సమయంలో దాని తోకభాగం రన్‌వే నేలను తాకింది" అని డీజీసీఏ వెల్లడించింది.
 
ఈ ఘటన కారణంగా విమానం వెనుకభాగం దెబ్బతింది. దీంతో దాని సేవలను నిలిపివేసినట్లు ఇండిగో వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. అప్పటిదాకా విమానం నడిపిన పైలట్లను కూడా విధుల నుంచి పక్కనబెట్టినట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments