Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ను ఢీకొట్టిన ఇండిగో విమానం... పైలెట్లపై చర్య

వరుణ్
గురువారం, 28 మార్చి 2024 (09:22 IST)
కోల్‌కతా విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొన్నాయి. పార్కింగ్ చేసివున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఇండిగో విమానం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎయిర్ ఇండియా విమానం ఫ్లైట్ రెక్కలను తగులుతూ ఇండిగో విమానం వెళ్లింది. దీంతో ఎయిర్ ఇండియా విమానం రెక్క విరిగిపోయింది. ఈ ఘటనపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించింది. అలాగే, ఈ ఘటనకు బాధ్యులైన ఇండిగో పైలెట్లను విధులకు దూరం చేసింది. 
 
చెన్నై వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇండిగో విమానం ఒకటి వచ్చి ఢీకొట్టింది. ఈ విమానం అపుడే ల్యాండింగ్ అయి పార్కింగ్ కోసం వస్తున్న సమయంలో ఎయిర్ విమానం రెక్కలను తగులుతూ వెళ్లిందని ఎయిర్ ఇండియా సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఘటన తర్వాత విమానానికి అదనపు తనిఖీలు నిర్వహించామని, ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. డీజీసీఏ, ఎయిర్‌పోర్టు అధికారులతో ఈ విషయమై నిరంతరం టచ్‌లో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments