Webdunia - Bharat's app for daily news and videos

Install App

2028 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం.. ఇస్రో చీఫ్

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (19:35 IST)
భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతుంది. భారతీయ అంతరిక్ష కేంద్రం కోసం తొలి పరీక్షలను వచ్చే ఏడాది నిర్వహించాలని ఇస్రో యోచిస్తోందని, 2028 నాటికి దాని మొదటి మాడ్యూల్‌ను తయారు చేసి, పరీక్షించి, ప్రయోగించేందుకు పరిశ్రమలతో చర్చలు జరుపుతోందని అంతరిక్ష సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ గురువారం తెలిపారు.
 
ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ సందర్భంగా ఎస్ సోమనాథ్ విలేకరులతో మాట్లాడుతూ, వీనస్‌కు భారతదేశం యొక్క మొదటి మిషన్ 2028లో ప్రారంభించే అవకాశం ఉందని, ఇంజనీర్లు కొన్ని అధిక-విలువైన భాగాలపై ఖర్చులను తగ్గించే పనిలో ఉన్నారని అన్నారు.
 
2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించాలని, 2040 నాటికి చంద్రుడిపై భారతీయ వ్యోమగామిని దింపాలని గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది వచ్చే ఏడాది జరుగుతుంది. ఇప్పటికే భారతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని సమీక్షించాను. మా సిబ్బంది చాలా ఎంపికలపై పని చేస్తున్నారు. దేన్ని ఎంచుకోవాలి, సమీప భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన పరీక్షలు జరిగే అవకాశం వుందని.. సోమనాథ్ తెలిపారు. 
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన నిజంగా అంతర్గతంగా ఉత్సాహాన్ని సృష్టించిందని చెప్పారు. 2028లో వీనస్‌కు మిషన్‌ను ప్రారంభించాలని కూడా ఏజెన్సీ యోచిస్తోందని, ఇంజనీర్లు ఆ దిశగా కృషి చేస్తున్నారని సోమనాథ్ చెప్పారు.
 
దేశం ఇప్పుడు మానవులను చంద్రునిపైకి పంపడానికి, అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి మిషన్లను అనుసరిస్తున్నందున నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (NGLV) అభివృద్ధి చేయబడిందని సోమనాథ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments