Webdunia - Bharat's app for daily news and videos

Install App

పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం సక్సెస్... 500-1000 కిలోల వరకు వార్‌హెడ్‌ను?

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (14:42 IST)
Prithvi-2
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దేశీయంగా అభివృద్ధి చేసిన పృథ్వీ-2 క్షిపణి పరీక్ష సక్సెస్ అయింది. మిస్సైల్‌ పరీక్షను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. 
 
ఒడిశాలోని బాలాసోర్‌లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం (జూన్15,2022) రాత్రి 7.40 గంటలకు మిస్సైల్‌ పరీక్ష విజయవంతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రైనింగ్‌ లాంచ్‌లో మిస్సైల్‌ కచ్చిత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
9 మీటర్ల పొడవు, సింగిల్-స్టేజ్ ద్రవ ఇంధనంతో పనిచేసే పృథ్వీ-2 మిస్సైల్‌ తొలిసారిగా 1996లో ప్రయోగించారు. 2003లో భారత సాయుధ దళాలలోకి ప్రవేశించింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన మొదటి క్షిపణి ఇదే.
 
తాజాగా ప్రయోగించబడిన పృథ్వీ-2 క్షిపణికి 350 కిలోమీటర్ల వరకు.. 500-1000 కిలోల వరకు వార్‌హెడ్‌ను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగివుంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్‌.. 350 కిలోమీటర్ల పరిధిలోకి రేంజ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ద్రవ ఇంజిన్లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments