Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యమా.. నో ఛాన్స్: భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ

భారత్-పాకిస్థాన్‌ల మధ్య సమస్యల పరిష్కారంలో అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ పాలుపంచుకునే అవకాశం ఉందని అమెరికా తరుపున ఐక్యరాజ్యసమితి శాశ్వత రాయబారి నిక్కీహాలే తెలిపారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (09:26 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య సమస్యల పరిష్కారంలో అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ పాలుపంచుకునే అవకాశం ఉందని అమెరికా తరుపున ఐక్యరాజ్యసమితి శాశ్వత రాయబారి నిక్కీహాలే తెలిపారు. దీనిపై ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ స్పందిస్తూ అమెరికాకు ఝలక్ ఇచ్చారు. భారతదేశం ప్రారంభం నుంచి విదేశీ వ్యవహారాల్లో తనకంటూ ఓ పద్ధతిని అవలంబిస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచి భారత్-పాక్‌ల మధ్య సమస్యల పరిష్కారానికి మూడో దేశం జోక్యాన్ని.. చివరకు ఐక్యరాజ్య సమితి జోక్యాన్ని కూడా అంగీకరించడం లేదు. 
 
అదే భారత విదేశాంగ విధానం. అయితే భారత్-పాకిస్థాన్‌ల మధ్య స్పర్ధలు సవరించేందుకు అగ్రరాజ్యం అమెరికా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియరాగానే.. భారత్ స్పందించింది. అమెరికా వివాదాస్పద అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్మీర్ విషయంలో రంగంలోకి దిగి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం రాగానే.. భారత్ ఎన్నటికీ తృతీయ దేశం జోక్యాన్ని సహించదు.
 
ఇంకా భారత్- పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న వివాదాలను రెండు దేశాలే పరిష్కరించు కోవాలన్న విధానానికే కట్టుబడి ఉన్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. తద్వారా మూడో దేశ ప్రమేయాన్ని మరోసారి నిర్ద్వంద్వంగా భారత్ తిరస్కరించింది. ఈ ప్రకటన ప్రధాని మోడీ ఆదేశాల మేరక విడుదలైనట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments